హనీమూన్‌ నాటి ఫొటో షేర్‌ చేసిన మహీంద్రా.. నెటిజన్ల కామెంట్స్ చూశారా..?

-

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ పోస్టు చేసి నెటిజన్లను సర్ ప్రైజ్ చేశారు.  ‘ఇంటర్నేషనల్‌ చెస్‌ డే’ను పురస్కరించుకుని తాను చెస్‌ ఆడుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. అది తన హనీమూన్‌ నాటి ఫొటో అట. ఈ విషయాన్ని చెబుతూ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

‘‘గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ జరిగినప్పుడు.. ‘ఎప్పుడైనా చెస్‌ ఆడారా?’ అని నన్ను చాలా మంది అడిగారు. దీంతో నేను నా పాత జ్ఞాపకాల ఆల్బమ్‌ను శోధించగా ఈ ఫొటో దొరికింది. ఇది ఆగ్రాలో నా హనీమూన్‌లో తీసుకున్న ఫొటో. రోబోటిక్‌ చెస్‌ బోర్డుపై ఆడలేదు. నా భార్య కెమెరా కోసం కేవలం పోజిచ్చానంతే..! అయితే ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో నా చెస్‌ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని ఆనంద్‌ మహీంద్రా రాసుకొచ్చారు. ఈ ఫొటోను దాదాపు 3 లక్షల మంది వీక్షించగా.. ‘మీ థ్రో బ్యాక్‌ ఫొటో బాగుందం’టూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news