BREAKING: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి..

-

అమెరికాలో తెలుగు విద్యార్థులు, వ్యక్తుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి..చెందారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలోని మిస్సోరి స్టేట్ లోని శ్యాండిల్ ఎస్ టౌన్ లో ఈత కొట్టేందుకు ముగ్గురు స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్లోకి దిగాడట కిరణ్.

Another Telugu student dies in America

అయితే.. ఈత రాకపోవడంతో నీటమునిగి మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత వారం రోజుల కిందట..అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో గోపీకృష్ణ పని చేస్తుండగా.. అక్కడ జరిగిన కాల్పుల్లో అతడికి తీవ్రగాయాలవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version