తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికీ లేఖ నో నో నో రాశారు. లారీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలు అయితే దేశవ్యాప్తంగా వాహన యజమానులు, డ్రైవర్లకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయని ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన G.S.R.124E డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి లేఖ రాశారు. ఈనెల 7వ 7న కేంద్రం ప్రభుత్వం GSR 124 ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంట్లో 12 సంవత్సరాల పైబడిన వాహనాలపై తీవ్రమైన పరిమితులు విధించబడ్డాయి
దీనివల్ల లారీలపై ఆధారపడి జీవిస్తున్న వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కేంద్రం తీసుకొచ్చిన జిఎస్సార్ 124 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వల్ల సంభవించే సమస్యల పరిష్కారాలపై లారీ ఓనర్స్ లేవనెత్తిన డిమాండ్స్ చూసినట్లయితే లక్షలాది మంది ఓనర్ కం డ్రైవర్లు తమ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ నిబంధనలో అమలయితే వారు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.