ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై గుజరాత్ లో దాడి !

-

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ లో ఓ వ్యక్తి వాటర్ బాటిల్ తో దాడికి యత్నించాడు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్కోట్ లో చోటుచేసుకుంది. రాజ్కోట్ లోని ఒక ఆలయ ప్రాంగణంలో గర్భా జరుగుతోంది. ఆ గర్భాలో ప్రజలను కలవడానికి కేజ్రీవాల్ వెళ్లారు. దీంతో కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకొని వెనుక నుంచి ఓ వాటర్ బాటిల్ ని విసిరారు. అయితే ఆ వాటర్ బాటిల్ ఆయనను దాటుకొని వెళ్లి పడింది.

ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేజ్రీవాల్ ను అక్కడి నుంచి తరలించారు. వాటర్ బాటిల్ ఖాళీగా ఉందని, అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. గుజరాత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ జెండా పాతేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి రెండు రోజుల పర్యటనలో ఉన్న ఆయనపై ఈ దాడికి యత్నించారు. కాగా గుజరాత్ లో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇదేే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version