అయోధ్య బాలరాముడి విగ్రహం గురించి ఈ విషయాలు తెలుసా?

-

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజిల్లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనుండగా.. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బాలరాముడి విగ్రహం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.

బాలరాముడి విగ్రహ ప్రత్యేకతలు ఇవే..

  • 51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలరాముడి విగ్రహం
  • నల్లని రాతితో కమలంలో నిలబడి ఉన్నట్లు విగ్రహం తయారీ
  • విగ్రహాన్ని రూపొందించిన కర్ణాటక శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌
  • ఏటా శ్రీరామనవమి రోజు గర్భగుడిలోని రాముడిపై సూర్యకిరణాలు
  • రాముడి నుదుటిపై 6 నిమిషాలు సూర్యతిలకం పడేలా అద్దాలు ఏర్పాటు
  • తూర్పు ద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు
  • దర్శనానంతరం దక్షిణ దిశ నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు
  • ఆలయ కాంప్లెక్సులో ఒకేసారి 70 వేల మంది ఉండేలా నిర్మాణం
  • ఆలయ నిర్మాణంలో ఒడిశా, యూపీ, రాజస్థాన్‌ శిల్పకారులు
  • రామమందిర నిర్మాణానికి 2,587 ప్రాంతాల నుంచి మట్టి సేకరణ

Read more RELATED
Recommended to you

Exit mobile version