BREAKING : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

-

పరువు నష్టానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్కు బెంగళూరు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమపై అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్‌ అగ్రనేతలపై బీజేపీ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను విచారించింది.

తాజాగా రాహుల్‌ గాంధీని శుక్రవారం విచారించింది. ఈ క్రమంలోనే విచారణ అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు బెంగళూరు చేరుకున్న రాహుల్‌ను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతించారు. ఈ క్రమంలో రాహుల్కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version