పెళ్లికి అంగీకరించలేదని యువతి కుటుంబంపై కాల్పులు.. ఇద్దరు మృతి

-

పక్కింటి యువతిని ప్రేమించిన ఓ యువకుడు వారి పెళ్లికి ఆ కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. కోపంలో విచక్షణ కోల్పోయి వారిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి పక్కాగా ప్రణాళిక రచించాడు. చఠ్ పూజలో పాల్గొని ఆ కుటుంబమంతా ఇంటికి తిరిగి వెళ్తుండగా వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్​లో చోటుచేసుకుంది. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు కాల్పులు జరిపిన పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖిసరాయ్‌ జిల్లాలోని పంజాబీ మొహల్లా ప్రాంతంలో ఇవాళ ఉదయం ఆరుగురు కుటుంబ సభ్యులు… ఛఠ్‌ పూజలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా పక్కింటి యువకుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ద్దరు మృతిచెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నలుగురిలో ముగ్గురిని తొలుత బెగుసరాయ్‌ ఆసుపత్రికి తరలించి.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి  పట్నాకు పంపించారు. ప్రేమ వ్యవహారమే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version