రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం.. బిల్లుల అమలుకు వారి మద్దతు కీలకం

-

రాజ్యసభలో అధికార బీజేపీకి సంఖ్యాబలం తగ్గింది. ఎగువసభలో నలుగురు నామినేటెడ్‌ సభ్యులు గత శనివారం పదవీవిరమణ చేయడంతో బీజేపీ ఎంపీల సంఖ్య 86కు పడిపోయింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులను ఆమోదించుకోవాలంటే ఈ పార్టీకి మద్దతు కావాల్సిందే.

245మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలు ఉన్నాయి. మెజార్టీ మార్క్‌ అయిన 114 కంటే ప్రస్తుతం ఎన్​డీఏ సంఖ్యాబలం తక్కువగా ఉంది. ఏడుగురు నామినేటెడ్‌, ఇద్దరు స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్నప్పటికీ వారితో కలిపినా మెజార్టీ మార్క్‌ దాటదు.

అధికార పార్టీకి సంఖ్యాబలం తగ్గడం వల్ల, వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్‌ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. బిజు జనతాదళ్, బీఆర్​ఎస్​ వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి. బిల్లులను ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం. రాజ్యసభలో బిజు జనతాదళ్‌ పార్టీకి 9మంది ఎంపీలుండగా, ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో వీరు ప్రతిపక్షం వైపు ఉండటం గమనార్హం. అయితే, అన్నాడీఎంకే, వైసీపీ మద్దతుతో బీజేపీ నెగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజ్యసభలో వైసీపీకి 11, అన్నాడీఎంకేకు నలుగురు ఎంపీలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version