‘ఇంటి పని దంపతులిద్దరు సమానంగా చేయాలి!’.. బాంబే హైకోర్టు వ్యాఖ్యలు

-

ఈ కాలంలో దాదాపు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. కానీ కేవలం మహిళలు మాత్రమే ఇంటి పని.. ఆఫీసు పని అంటూ రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే నేటి సమాజంలో ఇంటి పని భారాన్ని.. భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని తాజాగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరూ ఉద్యోగాలు చేసినప్పుడు.. ఇంటి పని ఒక్క భార్యే చేయాలనుకోవడం పాత కాలపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఓ కేసు నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆ కేసు నేపథ్యం ఏంటంటే.. 13ఏళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్న 35 ఏళ్ల వ్యక్తి.. తన భార్య ఇంటి పనులు చేయడం లేదంటూ ఆమె నుంచి విడాకులు కోరుతూ 2018లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు అతడి పిటిషన్​ను కొట్టివేసింది. ఆ కోర్టు ఉత్తర్వ్యులను బాంబే హైకోర్టులో అతడు సవాల్ చేయగా.. రోజూ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేయమని తనను బలవంతం చేశారని సదరు మహిళ హైకోర్టుకు తెలిపింది.

పిటిషనర్​ దాఖలు చేసిన అప్పీల్​ను న్యాయమూర్తి నితిన్​ సాంబ్రే, షర్మిలా దేశ్​ముఖ్​తో కూడిన డివిజిన్​ బెంచ్​ తోసిపుచ్చింది. బాధితురాలు మానసిక క్రూరత్వాన్నికి గురైందని ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version