ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం..

-

 

Central cabinet meeting today: ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపై కూడా చర్చ జరిగే ఛాన్స్‌ ఉంది.

ఇక దసరా, దీపావళి వస్తున్న తరుణంలోనే.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని  ప్రధాని మోడీ పేర్కొన్నారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం తరువాత ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. హర్యానా రైతులు తాము బీజేపీ వైపే ఉన్నామని నిరూపించుకున్నారు. హర్యానాలో కమలం మూడో సారి వికసించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి అధిక సీట్లు వచ్చాయి. బీజేపీకి మాత్రం గతం కంటే అధికంగా ఓట్లు లభించాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version