బాణాసంచా గోదాంలో పేలుడు.. ఐదుగురు దుర్మరణం

-

బాణాసంచా భద్రపరిచిన గోదాంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ గోదాం నివాస సముదాయాల మధ్యలో ఉండటం వల్ల పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి.

స్థానికుల సమాచారంతో పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. వీలైనంత త్వరగా ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news