తీవ్ర తుపానుగా మారిన ‘బిపోర్‌ జాయ్‌’.. 3 రాష్ట్రాలకు వార్నింగ్

-

అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను ‘బిపోర్‌ జాయ్‌’ మరింత తీవ్రరూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని.. 24 గంటల్లో ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో ఉత్తర-ఉత్తర-పశ్చిమ దిశగా తుపాను కదులుతుందని పేర్కొంది. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్‌ బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని.. పోర్‌బందర్‌కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం.. గుజరాత్‌ను తాకకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు.  వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. బలమైన ఈదురు గాలులూ వీస్తాయని చెప్పారు. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version