దేశ స‌రిహ‌ద్దులో 43 వంతెన‌లు.. నేడే జాతికి అంకితం

-

దేశ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా ప‌ర్య‌వేక్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని సరిహద్దు ప్రాంతాల్లో 43 వంతెన‌ల‌ను నిర్మించింది. వీటిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వెళ్లే మార్గంలో నెచిఫూ టన్నెల్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆ త‌ర్వాత‌ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తయారు చేసిన 43 వంతెనలను జాతికి అంకితం చేయనున్నారు. వంతెనల్లో ప‌ది జమ్మూ కాశ్మీర్‌లో, హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎనిమిది, సిక్కిం, పంజాబ్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ 43 వంతెనల్లో చాలా వరకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్నాయి. సైనిక దళాలు, ఆయుధాల వేగంగా కదలడానికి సాయపడతాయి రక్షణశాఖ అధికారులు ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఇదిలా ఉండ‌గా.. భారత్‌, చైనా మధ్య ఘర్షణకు దారిన తీసిన క్రమంలో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) తూర్పు లడఖ్‌లో నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో డార్చాతో లడఖ్‌ను కలిసే వ్యూహాత్మక రహదారితో సహా పలు ప్రాజెక్టుల పనులను ముమ్మ‌రం చేసింది. సుమారు 290 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి లడఖ్ ప్రాంతంలోని సరిహద్దు స్థావరాలలోకి బలగాలు, భారీ ఆయుధాల తరలింపుకు కీలకంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news