వందే భారత్ ట్రైన్ లో వాటర్ లీక్ అవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే…. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ట్రైన్ లో వాటర్ లీక్ కావడంతో ప్రజలు విమర్శలు జారీ చేస్తున్నారు. వారణాసి నుంచి ఢిల్లీకి వెళుతున్న 22415 వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఏసి ఔట్ లెట్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. దీంతో ప్రయాణికులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం ఈ వాటర్ లీకేజ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించారని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రైన్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా వాటర్ లీకేజ్ సమస్య వల్ల ప్రజలు ప్రయాణించే సమయంలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
A complimentary "waterfall" service unlocked in the Delhi-bound 22415 Vande Bharat express caught the passangers off-raincoat. pic.twitter.com/ioLd3HniPC
— Piyush Rai (@Benarasiyaa) June 24, 2025