IPL 2021 : ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన ఢిల్లీ…నేరుగా ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ !

-

ఇవాళ ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ కాపీటల్స్ తలపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై అవలీలగా విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్ జట్టు. ముంబై ఇండియన్స్ పై ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 130 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఆరు వికెట్లు కోల్పోయి చేయించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 26 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 33 పరుగులు నాటౌట్ మరియు ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ… మిడిలార్డర్ రాణించడంతో… ముంబై ఇండియన్స్ జట్టుపై ఘన విజయం సాధించింది డిల్లీ క్యాపిటల్స్. ఇక ముంబై ఇండియన్స్ పై విజయంతో నేరుగా ప్లేస్ లోకి దూసుకు వెళ్ళింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేస్ లోకి ఎంటర్ కాగా..  తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో జట్టుగా ఎంట్రీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news