దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా కొనసాగుతోంది. వరసగా ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల్లో డ్రగ్స్ పట్టుబడుతోంది. తాజాగా ఢిల్లీలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏయిర్ పోర్టులో దాదాపుగా రూ. 434 కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్ ను అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ.434 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు. ఉగాండా నుంచి ఢిల్లీ వచ్చిన పార్సిల్లో హెరాయిన్ గుర్తించారు. 126 ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్ ను స్మగ్లర్లు దాచారు.