ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఓ బూటకం – కేజ్రీవాల్

-

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. పొరపాటున చార్జి షీట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ పేరును పేర్కొంది. దీంతో సంజయ్ సింగ్ ఈడీకి లీగల్ నోటీసులు పంపారు. చార్జిషీట్ లో ఈడీ తన పేరును ఇరికించి అసత్య ప్రసారం చేసిందని లీగల్ నోటీసులలో పేర్కొన్నారు సంజయ్ సింగ్. దీంతో సంజయ్ సింగ్ కి ఈడి వివరణ ఇచ్చింది.

దీనిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఓ భూటకమని అన్నారు. చార్జ్ షీట్ లో తమ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేరును చేర్చినట్టు ఈడి చెప్పడమే దీనికి నిదర్శనం అని అన్నారు. పొరపాటున కూడా చార్జిషీట్లో పేరు రాస్తారా..? అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version