పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

-

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా మార్వాల్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ మొద‌లైంది. పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపడుతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం మార్వాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తుండ‌గా.. ఉగ్రవాదులు కాల్పులకు దిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా, ఈ నెల 11న బుద్గాం జిల్లాలో కవూసా ఖలీసా ప్రాంతంలోనూ భద్రతా బలగాల కాల్పులల్లో ఓ ఉగ్రవాది హతమైన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news