ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేడు ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో తుది తీర్పు రానుంది. ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో 14 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువరించనుంది సీబీఐ కోర్టు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణలు ఉన్నాయి. ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి రోశయ్య ప్రభుత్వం జీవో. 71 విడుదల చేశారు. 2011లో మొదటి చార్జిషీటు దాఖలు చేసింది సీబీఐ. రూ.884. కోట్ల ప్రజాధనం లూటీ చేశారని సీబీఐ అభియోగాలు వచ్చాయి. 219 మంది సాక్షులను విచారించి, 3,400 డాక్యుమెంట్లలతో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక నేడు ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో 14 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువరించనుంది సీబీఐ కోర్టు.