మాస్క్ పెట్టుకోకుంటే విమానం నుంచి బలవంతంగా దించేయండి: ఢిల్లీ హైకోర్టు

-

విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలను బేఖాతరు చేయడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారించింది. కరోనా రూల్స్ పాటించని వారికి భారీ జరిమానాలు వేయాలని జస్టిస్ సంఘీ పేర్కొన్నారు. విమానాల్లో మాస్క్ నిబంధనలను తప్పనిసరి చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిని అవసరమైతే విమానాలు, విమానాశ్రయాల నుంచి బయటకు బలవంతంగా పంపించేయాలని తేల్చిచెప్పారు.

మాస్కులు పెట్టుకోవాలని చెప్పేది కరోనా ముప్పును తగ్గించేందుకేనని, ఇప్పటికే నియమనిబంధనల్లో మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్నారని గుర్తు చేశారు. తినేటప్పుడు, తాగేటప్పుడు మాస్క్ తీస్తే ఎవరూ వద్దనరని, విమాన ప్రయాణంలో మిగతా సమయాల్లో మాత్రం తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇందుకు అనుగుణంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కఠిన నిబంధనలను రూపొందించాలని జస్టిస్ సంఘీ ఆదేశాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news