బిజెపిలో చేరిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్

-

భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని ఈ ఏడాది జనవరిలో ఈడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ రాజీనామా చేశారు. అయితే హేమంత్ సోరేన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఝార్ఖండ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి బాధ్యతలనుంచి చంపై సోరేన్ వైదొలగడం.. మళ్లీ హేమంత్ సీఎంగా పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి.

ఈ క్రమంలో సొంత పార్టీ అధిష్టానం పై చంపై సోరేన్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని బహిరంగంగానే తెలిపారు. దీంతో ఆయన సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కానీ ఆయన బిజెపి అగ్ర నాయకులతో భేటీ కావడంతో బిజెపిలో చేరతారు అనే ప్రచారం జరిగింది.

స్వయంగా ఆయన బిజెపిలో చేరతనని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు చంపై బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. నేడు రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత సమక్షంలో బిజెపిలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news