పేదలందరికీ ఉచితంగా విద్యుత్ – ప్రధాని మోడీ ప్రకటన

-

సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.. ‘వికసిత భారత్‌’ పేరుతో బీజేపీ మేనిఫెస్టో చేశారు. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ…సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు.

70 ఏళ్ల లోపు అందరికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు చేస్తామని సంచలన ప్రకటన చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుంది..ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు చేస్తామన్నారు. పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికి సబ్సిడీ ధరకు గ్యాస్ అందిస్తామని వివరించారు. మహిళలను లక్షాధికారులను చేయడమే మా లక్ష్యం అన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news