గత పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ… నిత్యం ఇండియన్ ఆర్మీ పై.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… వాళ్లను కించపరుస్తున్నారు. గాల్వాన్ సంఘటన నుంచి బాలకోట్ సంఘటన వరకు.. జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ని కించపరుస్తూ రాహుల్ గాంధీ పదేపదే వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. శత్రుదేశంతో పోరాడే ఇండియన్ ఆర్మీ ని అలాగే స్పెషల్ ఫోర్సును మనోధైర్యాన్ని చంపేసేలా.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉంటున్నాయి.

ఇండియన్ ఆర్మీ పోరాటాలపై విమర్శలు
పాకిస్తాన్ దాడులు చేసి అన్యాయంగా మన పౌరులను చంపేస్తే.. మోడీ ప్రభుత్వం కౌంటర్ ఇస్తూనే ఉంది. అలా కౌంటర్ ఇవ్వడంలో ఇండియన్ ఆర్మీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పాకిస్తాన్ దాడి చేసిన ప్రతిసారి ఇండియన్ ఆర్మీ కౌంటర్ ఇవ్వడంలో సక్సెస్ అయింది. మొన్నటికి మొన్న పహల్గాం సంఘటనలో కూడా 100 మంది ఉగ్రవాదులను మట్టికరిపించింది ఇండియన్ ఆర్మీ. అయితే అలాంటి విరోచిత పోరాటం చేసిన ఇండియన్ ఆర్మీ సిబ్బందిని.. రాహుల్ గాంధీ కించపరుస్తూ మాట్లాడారు. ఇదంతా బీహార్ రాజకీయాల కోసం అని… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం లేనట్లే వ్యవహరిస్తున్నారు రాహుల్ గాంధీ. వీరోచిత పోరాటం చేసిన ఇండియన్ ఆర్మీ శ్రమకు ప్రతిఫలం లేకుండా.. నీరుగారిస్తున్నారు.
రాజకీయాల కోసం దిగజారుతున్న రాహుల్ గాంధీ
గత పది సంవత్సరాలుగా ఇండియాలో అధికారం రాక కాంగ్రెస్ పార్టీ… చచ్చి బతుకుతూ… పోరాడుతోంది. అయితే అధికారంలోకి వచ్చేందుకు… వంకర బుద్ధితో వ్యవహరిస్తోంది కాంగ్రెస్. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో. మోడీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. ఎప్పుడు యుద్ధం వచ్చిన కూడా… గట్టి ఎటాక్ ఇచ్చింది. ఇలాంటి యుద్ధ వాతావరణ సమయంలో… అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి అండగా నిలవకుండా… రాహుల్ గాంధీ… ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే మరో 30 ఏళ్ళు కూడా ఇండియాలో అధికారంలోకి రాదని జనాలు చర్చించుకుంటున్నారు.