స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్ కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..!

-

తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వం లాంచనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా  అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగా మిగా ఉందని తెలిపారు.

విషాదకర పరిస్థితిలో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్ధమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాద్యమైంది అని వివరించారు.  మరణించిన తరువాత అవయవాదనం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి అనే  విషయాన్ని ప్రతి ఒక్కరు తమ బంధు, మిత్రులకు తెలియజేయాలని సూచించారు.  మిగిలిన వాళ్లు కూడా ఇలాగే అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలని కోరారు.  అవయవ దాతలు వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని సీఎం స్టాలిన్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version