కంగ‌న వ్యాఖ్య‌ల‌పై స్పందించిన గాంధీ మునిమ‌న‌వ‌డు

-

ఇటీవ‌ల బాలీవుడ్ వివాద‌స్ప‌ద హీరోయిన్ కంగ‌న రౌన‌త్ స్వాతంత్య్రం పై గాంధీ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల పై ప‌ట్ల స‌ర్వత్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి కే చాలా మంది సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కుల తో పాటు ప‌లువురు మేధావులు కూడా కంగ‌న చేసిన వ్యాఖ్య‌ల పై తీవ్రంగా స్పందించారు. తాజాగా మ‌హత్మ గాంధీ ముని మ‌నవ‌డు తుషార్ గాంధీ కూడా కంగ‌న చేసిన వ్యాఖ్య‌ల పై స్పందించాడు. ఒక చెంప పై కొడితే మ‌రో చెంప చూపించ‌డం పిరికి పంద చ‌ర్య అని కొంద‌రు అంటున్నారని బాలీవుడు హీరోయిన్ కంగ‌న ను ఉద్ధేశించి అన్నారు.

కాని ఒక చెంప పై కొడితే మ‌రో చెంప చూపించ‌డాన‌కి చాలా ధైర్యం కావాల‌ని అన్నారు. ఇలా ఆరోపించిన వారే పిరికి పంద‌లు అని ఆగ్ర‌హించారు. కాగ గ‌త కొద్ది రోజుల క్రితం గాంధీజీ ని ఉద్దేశించి హీరోయిన్ కంగ‌న రౌన‌త్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఒక చెంప పై కొడితే మ‌రో చెంప చూపించ‌డం పిరికి పంద చ‌ర్య అని అంది. అంతే కాకుండా ఇలా మ‌రో చెంప చూపెడితే స్వాతంత్య్రం రాద‌ని.. భిక్ష మాత్ర‌మే వ‌స్తుందంటూ మ‌హ‌త్మ గాంధీ ని ఉద్ధేశించి అంది. ఈ వ్యాఖ్య ల‌పై భార‌త దేశం మొత్తం భ‌గ్గు మంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news