స్కూటీలు, బైక్ లకు కేంద్ర కొత్త రూల్స్.. ఇక పై అవి ఉండాల్సిందే…!

-

కేంద్ర ప్రభుత్వం ఇకనుంచి అన్ని రకాల కొత్త టూవీలర్లకు ఏబిఎస్ యాంటీ లాక్ బేకింగ్ సిస్టమ్ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం 125 సిసి ఇంజిన్ కెపాసిటీ దాటిన 2 వీలర్లకే ఏబిఎస్ ఖచ్చితంగా ఉండాలనే రూల్ ఉంది.

Govt to make anti lock braking systems must for all new two wheelers from January
Govt to make anti lock braking systems must for all new two wheelers from January

సడన్ బ్రేక్ వేసినట్లయితే టైర్ లాక్ అవ్వకుండా ఏబీఎస్ హెల్ప్ చేస్తుంది. దీంతో బైక్ స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ లో ఉంటుంది. దీంతో కొంతవరకైనా రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సంతోషపడుతున్నారు. ప్రతిరోజు రోడ్లపై అనేక రకాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news