మళ్లీ నేనే ప్రధాని..క్లారిటీ ఇచ్చిన మోదీ..

-

ప్రధానమంత్రి పదవిలో కొనసాగడం పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశం అసలే లేదని వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న వృద్ధులు, వితంతువులు, పేదప్రజల తో మోదీ వర్చువల్ గా ముచ్చటించారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు ప్రధాని పదవి చేపడితే అంతా అయిపోయినట్లు కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ విపక్ష నాయకుడి మాటలను గుర్తు చేసుకున్నారు.” ఒకరోజు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు నన్ను కలిశారు. రాజకీయంగా నన్ను ఆయన తరచు విమర్శిస్తుంటారు.

కానీ నేను ఆయనను గౌరవిస్తాను. ఆయనకు కొన్ని విషయాలపై ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నన్ను కలిసేందుకు వచ్చారు. అప్పుడు ఆయన..’ మోడీజి.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు?’ అని అడిగారు. రెండుసార్లు ప్రధాని అయితే అన్ని సాధించినట్టేనని ఆయన అభిప్రాయంతో ఉన్నారు. కానీ మోడీ అందరికంటే చాలా భిన్నమని ఆయనకు తెలియదు. మోడీ గుజరాత్ గడ్డమీద పెరిగాడు. అందుకే నేను దేన్ని అంత తేలిగ్గా తీసుకోను. విశ్రాంతి తీసుకోవాలని అనుకోను. సంక్షేమ పథకాలను 100 శాతం మంది లబ్ధిదారులకు అందేలా చూడటమే నా కల” అని అన్నారు నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version