గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య.. 9 నెలల !

-

గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయింది ఓ ఐఏఎస్ అధికారి భార్య. తొమ్మిది నెలల తర్వాత తిరిగొచ్చి ఆత్మహత్య చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లోని సెక్టార్ 19లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో కార్యదర్శిగా ఉన్న రంజీత్ కుమార్ అనే వ్యక్తి భార్య (సూర్య జయ్) అనే 45 ఏళ్ల మహిళ తొమ్మిది నెలల క్రితం ఓ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారి పోయింది.

IAS officer’s wife who ran away with a gangster

అయితే ఇటీవల మహిళ మళ్లీ తన భర్త వద్దకు తిరిగి వచ్చింది.. తిరిగి రాగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే మదురైలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన కేసులో తమిళనాడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి సూర్య తన భర్త ఇంటికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version