‘అవిశ్వాసం’పై చర్చలో అధికార, విపక్షాల నుంచి మాట్లాడేది వీరే..

-

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో చర్చ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవ్వగా కాసేపటికే వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమవ్వనున్న సభలో.. అవిశ్వాస తీర్మానంపై డిబేట్‌ మొదలుపెట్టనున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఇది కొనసాగనుంది.

అవిశ్వాస తీర్మానంపై చర్చకు అధికార, విపక్షాలు రెడీ అయ్యాయి. అయితే ఈ సభలో విపక్ష కూటమి ‘ఇండియా’ తరఫున చర్చను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీలు గౌరవ్‌ గొగొయ్‌, మనీశ్ తివారీ, దీపక్‌ బైజ్‌, అధిర్‌ రంజన్‌ చౌధరీ, బెన్నీ బెహనాన్‌, హిబి ఈడెన్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియకోస్‌ చర్చలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక అధికార పక్షం తరఫున ఐదుగురు మంత్రులు, ఐదుగురు ఎంపీలు అవిశ్వాసంపై సమాధానమివ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున నిషికాంత్‌ దూబే చర్చను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజిజు చర్చలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news