IND vs WI : యశస్వి, గిల్ విధ్వంసం..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం..

-

IND vs WI : వెస్టిండీస్ జట్టుపై టీమిండియా నాలుగో టి20 మ్యాచ్ లో విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా… ఓపెనర్లు జైస్వాల్ 84 పరుగులు మరియు 77 పరుగులు చేసి రాణించడంతో మరో పద్దెనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది టీం ఇండియా జట్టు. ఈ విజయంతో ఐదు టి20 లో సిరీస్ ను టీమిండియా 2-2 తేడాతో సమం చేసింది. ఇక ఇవాళ ఈ టోర్నమెంట్ లో చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు.. సిరీస్ ఎగరేసుకు పోనుంది. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news