Army: పాకిస్తాన్‌లో ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల ఫోటోలను విడుదల

-

ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా POK మరియు పాకిస్తాన్‌లో తాము ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల ఫోటోలను విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. అటు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లో తాము ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల వీడియోను విడుదల చేశారు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్.

Indian Army releases photos of terror camps destroyed in POK and Pakistan as part of Operation Sindoor
Indian Army releases photos of terror camps destroyed in POK and Pakistan as part of Operation Sindoor

ఇది ఇలా ఉండగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్‌కి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించారు. కల్నల్ సోఫియా ఖురేషీ – యునైటెడ్ నేషన్స్ శాంతి రక్షణ బృందానికి ఎంపికైన తొలి భారతీయ మహిళా ఆఫీసర్. యుద్ధ వ్యూహాలు రచించడంలో ఆమె దిట్ట. అలానే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ – భారత వైమానిక దళంలో అనుభవమున్న అధికారి. ఈ ఆపరేషన్‌లో ఆమె గగన తలంలో కీలక పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news