యోగా డే స్పెషల్.. మంచుకొండల్లో సైనికుల ఆసనాలు

-

భారత్ లో ఇంటర్నేషనల్ యోగా డేను ఘనంగా జరుపుకున్నారు.  ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా యోగాసనాలు వేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా వారంతా యోగాతో చేకూరే ప్రయోజనాలను వివరించారు. కేంద్ర మంత్రులు జైశంకర్‌, బీఎల్‌ వర్మ, కిషన్‌ రెడ్డి, ప్రహ్లాద్‌ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్‌ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అవగాహన కల్పించారు.

మరోవైపు సరిహద్దుల్లో సైనికుల దగ్గరి నుంచి ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధనౌక వరకు అనేక చోట్ల యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సరిహద్దుల్లోని మంచుకొండల్లో సైనికులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా ప్రయోజనాలను వివరించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్‌ స్క్వేర్‌ కూడలిలో వేలాది మంది ఆసనాలు వేసి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news