సముద్రగర్భంలో రామసేతు వంతెన నిజమే.. ఇస్రో కీలక ప్రకటన

-

భారత్, శ్రీలంకల మధ్య రామ సేతు వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక వ్యాఖ్యలు చేసింది. రామ సేతు కాల్పనికం కాదని.. నిజమేనని స్పష్టం చేసింది.  ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కి.మీ. మేర ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉందని వివరించారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇస్రో ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version