తెలంగాణలో 5 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ

-

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించిన సర్కార్ మరికొన్ని పోస్టులతో మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దాదాపు 5వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగులు ప్రస్తుత డీఎస్సీ పరీక్షలకు బాగా సిద్ధమై 11 వేల ఉపాధ్యాయ పోస్టులను పొందాలని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు.

పాఠశాలలపై లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11వేల పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలిందని భట్టి విక్రమార్క తెలిపారు. వీటితోపాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీ చేస్తూనే ఉంటుందని భట్టి విక్రమార్క వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version