ఇండియా అంటేనే భారత్.. విమర్శకులకు జై శంకర్ స్ట్రాంగ్ కౌంటర్

-

ఇండియా పేరును కేంద్రం ఇక నుంచి భారత్​గా మార్చబోతోందన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై తీర్మానం కూడా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇండియా పేరు మార్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది దీన్ని సమర్థిస్తుంటే.. మరికొంత మందేమో విమర్శిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు మోదీ సర్కార్​పై తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం వల్ల భయపడి.. ఇలా మార్పు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇండియా పేరు మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్​. ఇండియా అంటేనే భారత్​ అని.. ఆ విషయం రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉందని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. భారత్​ అనే భావనను రాజ్యాంగం సైతం ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్​ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జై శంకర్​ మాట్లాడారు. జీ 20 సహా తదితర అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news