కేజ్రీవాల్ సందేశాన్ని చదివి వినిపించిన సతీమణి సునీత

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు పంపించిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. శరీరంలోని ప్రతీ రక్తపు బొట్టూ దేశానికే అంకితం చేశానని ఆయన సందేశంలో పేర్కొన్నారు. తన జీవితంలోని ప్రతీ క్షణాన్ని దేశ సేవకే అంకితం చేశానని, జైళ్లో ఉన్నా బయట ఉన్నా ఇకపై కూడా అదే చేస్తానని కేజ్రీవాల్‌ తెలిపారు.

ఆప్‌ ప్రభుత్వం వస్తే మహిళలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. అది అందుతుందో లేదోనని ఇప్పుడు తల్లులు, అక్కాచెల్లెల్లు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో తనను నమ్మండని కోరారు. త్వరలో వచ్చి ప్రతీ హామీని నెరవేర్చుతానని భరోసా కల్పించారు. తన కోసం ఆలయాలకు వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకోండని, తాను పోరాడటానికే పుట్టానని పేర్కొన్నారు. ‘భవిష్యత్‌లో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. ప్రపంచంలో భారత్‌ ఒక గొప్ప, బలమైన దేశం కావాలని ఆకాంక్షిస్తున్నా. భారత్‌ను బలహీన పరచాలని దేశం వెలుపలి, లోపలి శక్తులు కుట్ర చేస్తున్నాయి. ఆ శక్తులను ఓడించాలి.’ అని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version