ముంబయిలో శ్రద్ధావాకర్ తరహా హత్య

-

దిల్లీలో శ్రద్ధావాకర్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ హత్యను తలపించేలా ఇప్పటికే దేశంలో అరడజనుకుపైగా హత్యలు జరిగాయి. తాజాగా అదే తరహాలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మరోకేసు వెలుగు చూసింది. తన సహజీవన భాగస్వామిని హత్యచేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసిన వ్యక్తిని బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 56 ఏళ్ల వయస్సున్న మనోజ్‌ సాహ్నీ.. సరస్వతి వైద్య అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనంలో ఉన్నాడు. వారిద్దరు ముంబయిలోని మీరా రోడ్డులోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే నిన్న వారు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సరస్వతి హత్య గురించి వెలుగులోకి వచ్చింది. ఆమె శరీర భాగాల్లో కొన్నింటిని నిందితుడు కుక్కర్‌లో ఉడికించినట్లు తెలుస్తోంది.

” సరస్వతిని చంపిన తర్వాత మనోజ్.. చెట్లను నరికే యంత్రాన్ని కొనుక్కొని వచ్చి మృతదేహాన్ని ముక్కలు చేశాడు. మృతదేహం భాగాలను ప్రెజర్ కుక్కర్​లో ఉడికించాడు. బయటపడేసే ఉద్దేశంతో వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపాడు. ఘటనాస్థలి నుంచి 12-13 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నాం.”
–  పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news