మోదీ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఆహ్వానం

-

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిభవన్‌లో ఇవాళ రాత్రి 7.15 గం.కు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు కేంద్రమంత్రులుగా పలువురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్న రెండో వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ వరుసగా మూడుసార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టారు. మోదీ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు.

మోదీ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ఏడుగురు దేశాధినేతలు హాజరుకానున్నారు. బంగ్లా ప్రధాని హసీనా, నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌, మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, మోదీ ప్రమాణస్వీకారానికి భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గేతో పాటు 8 వేల మందికి పైగా ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మరోవైపు మోదీ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఆహ్వానం అందింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version