అమానుషం.. కూతుర్ని చంపి.. బైక్‌కు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు

-

అనుమానం పెనుభూతం అంటారు. చిన్న అనుమానంతో మొదలై అది మనుషులను చంపే వరకు దారి తీస్తుంది. తాజాగా తన కుమార్తెపై అనుమానంతో ఓ తండ్రి కిరాతకానికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా కూతుర్ని హత్య చేశాడు. అయినా కసి తీరక.. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బైక్​కి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

నిందితుడు బౌ ఓ కూలీ. బుధవారం రోజున అతడి కుమార్తె (20) ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి, మరుసటిరోజు తిరిగి వచ్చింది. తీవ్రమైన ఆగ్రహంతో బౌ ఆమెపై విరుచుకుపడ్డాడు. తీవ్రంగా కొట్టి పదునైన ఆయుధంతో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనానికి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లి దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు. ఈ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుణ్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కుల్దీప్‌సింగ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news