బర్త్‌ డే రోజు మెట్రోలో మోదీ ప్రయాణం.. చిన్నారికి చాక్లెట్ ఇచ్చిన ప్రధాని.. వీడియో వైరల్

-

నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మోదీకి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజు సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ద్వారకాలో ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ పొడిగింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని దిల్లీ మెట్రోలో ప్రయాణించారు.

మెట్రోలో మోదీ ప్రయాణించడం చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ప్రధానితో ప్రయాణం చేస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు. మోదీ రాగానే హ్యాపీ బర్త్ డే మోదీ జీ అంటూ చప్పట్లు కొడుతూ ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. ప్రయాణికులు మోదీతో సెల్ఫీలు కూడా దిగారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఓ బాలుడికి ప్రధాని చాక్లెట్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సిబ్బందితో ఆయన మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version