7న డీఎస్ శ్రద్ధాంజలి సభ.. సీఎం రేవంత్ను ఆహ్వానించిన ఎంపీ అర్వింద్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇవాళ కలిశారు. ఆయన నివాసంలో రేవంత్ను కలిసిన అర్వింద్ తన తండ్రి, కాంగ్రెస్ నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈనెల 7వ తేదీన ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులకు ఆయన కుటుంబ సభ్యులు ఆహ్వానాలు పంపుతున్నారు.

ధర్మపురి శ్రీనివాస్ ఈనెల 29వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయణ్ను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మరుసటి రోజున జూన్ 30వ తేదీన ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో డీఎస్కు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. డీఎస్ తన మరణానంతరం తన శరీరంపై కాంగ్రెస్ జెండా కప్పి ఉంచాలని, ఆయన కోరిక తాము నెరవేర్చామని ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version