BREAKING: మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ

-

Narendra Modi pays tribute to Mahatma Gandhi statue: మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు నరేంద్ర మోదీ. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు నరేంద్ర మోదీ. అనంతరం అక్కడి నుంచి నేరుగా బీజేపీ పార్టీ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఇక ఇవాళ మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.

Narendra Modi pays tribute to Mahatma Gandhi statue

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులతో పాటు సామాన్యులు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్‌ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news