భారత్​లో రోజుకు సగటున 78 హత్యలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన నేరాలు

-

గతేడాదిలో భారత్​లో రోజుకు సగటున 78 హత్యలు జరిగాయని.. మొత్తం 28,522 హత్య కేసులు నమోదయ్యాయని జాతీయ నేరగణాంకాల సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వివాదాలే హత్యలకు ప్రధాన కారణాలని.. ఆ తర్వాత వ్యక్తిగత ప్రతీకారం, పగ, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. 2022లో సాధారణ నేరాలు తగ్గినా.. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వయోవృద్ధులపై మాత్రం విపరీతంగా పెరిగాయని వెల్లడించింది.

2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య 4.5% మేర తగ్గిందని.. అదే సమయంలో మహిళలపై 4%, చిన్నారులపై 8.7% పెరిగాయని నివేదిక పేర్కొంది. సైబర్‌నేరాలు ఏడాది కాలంలో 52,974 నుంచి 65,893 (24.4%)కు పెరగగా.. ఈ విభాగంలో క్రైమ్‌ రేట్‌ 3.9 నుంచి 4.8కి పెరిగిందని తెలిపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నమోదైన కేసులు 5,164 నుంచి 5,610 (8.6%)కి పెరిగాయని.. ఇందులో 78.5% కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన కారణంగా, 17.9% కేసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైనట్లు ఎన్​సీఆర్​బీ నివేదిక వెల్లడించింది.

 క్రమసంఖ్య  నేరం పెరిగిన శాతం
 1  కిడ్నాప్‌లు  5.8%
 2   వృద్ధులపై వేధింపులు   9.3%
 3  ఎస్సీలపై వేధింపులు  13.1%
 4  ఎస్టీలపై నేరాలకు సంబంధించి  14.3%
 5  ఆర్థిక నేరాలు  11.1%
 6  అవినీతి కేసులు   10.5%
7 సైబర్‌నేరాలు 24.4%
8 మనుషుల అక్రమ రవాణా 2.8%
9 మిస్సింగ్‌ కేసులు 13.5%
10 ఆచూకీ తెలియని చిన్నారుల కేసులు 7.5%
11 ఆస్తి సంబంధ నేరాలూ 10.1%

 

Read more RELATED
Recommended to you

Latest news