ఎయిర్ ఇండియాకు కొత్త బాస్.. ఫ్ర‌మ్ ట‌ర్కీ

-

ఎయిర్ ఇండియాను ప్ర‌ముఖ వ్యాప‌ర దిగ్గ‌జ సంస్థ అయిన టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే న‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను తిరిగి లాభాల బాట‌లో ప‌ట్టించ‌డానికి టాటా గ్రూప్ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. తాజా గా ఎయిర్ ఇండియా కు సీఈవోగా కొత్త వ్య‌క్తిని టాటా స‌న్స్ నియ‌మించింది. ట‌ర్కిష్ ఎయిర్ లైన్స్ కు చైర్మెన్ గా ప‌ని చేసిన ఇల్క‌ర్ ఐసీని ఎయిర్ ఇండియాకు సీఈవో గా నియ‌మించింది.

కాగ ఈ రోజు టాటా స‌న్స్ బోర్డు స‌మావేశంలో టాటా స‌న్స్ చైర్మెన్ ఎన్. చంద్ర శేఖ‌ర‌న్ ఆధ్వ‌ర్యంలో బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఎయిర్ లైన్స్ లో చైర్మెన్ గా ప‌ని చేసిన అనుభ‌వం ఇల్క‌ర్ కు ఉండ‌టంతో సీఈవోగా నియ‌మించింది. కాగ ఇల్క‌ర్ ట‌ర్కి రాజ‌ధాని ఇస్తాంబుల్ న‌గ‌రానికి చెందిన వాడు. కాగ ఎయిర్ ఇండియా సీఈవో బాధ్య‌త‌ల‌ను ఇల్క‌ర్.. ఏప్రిల్ 1 వ తేదీన తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version