world Cup 2023 : ఇవాళ లంకతో కివీస్‌ అమీతుమీ..గెలిస్తే సెమీస్‌లోకి ఎంట్రీ !

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య 41వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే నేరుగా సెమీఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

New Zealand vs Sri Lanka, 41st Match

ఇప్పటికే ఇండియా, దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్టు సెమి ఫైనల్లోకి చేరాయి. ఇప్పుడు నాలుగు స్థానం కోసం జట్లు పోరాడుతున్నాయి. ఇవాళ మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ ఖచ్చితంగా సెమీఫైనల్ లోకి చేరుతుంది. అటు ఇప్పటికే శ్రీలంక జట్టు వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కానీ ఇవాళ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక ఆలోచన చేస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news