దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ఇదే…!

-

దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ప్రయాణికులకు త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. కర్ణాటక శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపంలోని శరావతి బ్యాక్ వాటర్ పైన రూ. 473 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను నితిన్ గడ్కరి నిన్న ప్రారంభించారు. 2.14 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జి 740 మీటర్ల వెడల్పు ఆధారంగా నిలిచి ఉంది.

Nitin Gadkari inaugurates India's second longest cable-styled bridge in Karnataka's Shivamogga
Nitin Gadkari inaugurates India’s second longest cable-styled bridge in Karnataka’s Shivamogga

కాగా, గుజరాత్ ఒఖా-బేట్ ద్వారకా మధ్య ఉన్న సుదర్శన్ సేతు దేశంలోనే పొడవైన 2.32 కిలోమీటర్ల కేబుల్ బ్రిడ్జి కావడం విశేషం. ఇది దేశంలోనే మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జి కాగా ఇప్పుడు రెండో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news