జీ20 సదస్సు వేళ రాష్ట్రపతి ‘విందు’.. ఖర్గేకు రాని ఆహ్వానం

-

భారత్ వేదికగా దిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. 19 దేశాలకు చెందిన అతిథుల రాక మొదలైంది. ఈ క్రమంలో అతిథులతో పాటు మాజీ ప్రధానులు, కేంద్రమంత్రులకు జీ20 విందుకు ఆహ్వానం అందింది. అయితే శతాధిక పార్టీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఆహ్వానం రాలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధ్రువీకరించింది. దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ విందు జరగనుంది. దీంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.

శనివారం రోజున రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ విందు ఇవ్వనున్నారు. కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ విందు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో భాగంగానే కేబినెట్‌ హోదా కలిగిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఖర్గేకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version