‘ఆపరేషన్‌ సింధూర్’… 90 మంది ఉగ్రవాదులు మృతి

-

‘ఆపరేషన్‌ సింధూర్’ దెబ్బకు 90 మంది ఉగ్రవాదులు మరణించారు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ ‘ఆపరేషన్‌ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లొని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. హతమైన టెర్రరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Operation Sindoor , ind vs pak

అటు పాక్ ఆర్మీ దాడిలో ముగ్గురు భారత్ పౌరులు మృతి చెందారు. మరోవైపు పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పుకొడుతోంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్, పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. దీనికి పెట్టిన పేరు లోనే పాక్‌కు ఓ సందేశం ఉంది. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు చంపిన వారిలో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లై న నవవధువరులు ఉన్నారు. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అర్థం కూడా దీనిలో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news