తిలక్ వర్మ ఇన్నింగ్స్ నన్ను ఆకట్టుకుంది : హార్దిక్ పాండ్యా

-

వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. దీనిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ చిన్న తప్పులు చేయడం వల్లే ఓటమి పాలయ్యామని అన్నారు. ‘యువ జట్టు బరిలో ఉన్నప్పుడు చిన్న తప్పులు సహజం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని చేదించలేకపోయాం. ముఖేష్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. తిలక్ వర్మ ఇన్నింగ్ ఆకట్టుకుంది. కొంచెం కూడా భయం కనిపించలేదని’ అన్నారు.

కాగా, వెస్టిండీస్ చేతిలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్న ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో… నాలుగు పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో ఆర్ వికెట్లు కోల్పోయి ఏకంగా 149 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేతనలో తడపడ్డ టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version