కన్నతల్లిపై రేప్​.. సుత్తితో కొట్టి కొడుకును చంపిన తల్లిదండ్రులు

-

సొంత కుమారుడిని తల్లిదండ్రులే చంపి గోనె సంచిలో చుట్టి బయట పడేసిన ఘటన మధ్యప్రదేశ్​లోని ఇందౌర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు బయటపడటంతో షాకయ్యారు.కన్న తల్లిపై అత్యాచారానికి పాల్పడడం వల్లే కుమారుడిని అతడి తల్లిదండ్రులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందౌర్​లోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న గోనె సంచిలో చుట్టి ఉన్న ఓ మృతదేహం పారిశుద్ధ్య కార్మికులకు కనిపించగా.. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు  మృతదేహాన్ని ఉంచిన గోనె సంచిపై ఉన్న అడ్రస్​ను బట్టి నిందితులను పట్టుకోగలిగారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతుడు సుధాన్షు ఏప్రిల్ 24న కన్నతల్లిపైనే సుధాన్షు అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసింది.

ఆ విషయాన్ని భర్తకు బాధితురాలు తెలియజేయగా.. కోపోద్రిక్తుడైన భర్త భార్యతో కలిసి రాత్రి 3 గంటల సమయంలో సుధాన్షును సుత్తి, స్క్రూడ్రైవర్​తో కొట్టి హత్య చేశారు. అనంతరం కొడుకు మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచిన దుర్వాసన రావడం వల్ల ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున బైక్​పై మృతదేహాన్ని సుధాన్షు తండ్రి రాజారామ్ నిర్జీవ ప్రదేశంలో పడేశాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version